S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/18/2018 - 05:08

* తెరచుకున్న ఆలయం.. పోటెత్తిన భక్తులు

10/17/2018 - 17:10

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అక్బర్ రాజీనామా చేశారు. మీటూ ఉద్యమం ప్రారంభమైన తరువాత రాజీనామా చేసిన తొలి వ్యక్తి అక్బర్ కావటం గమనార్హం. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను వ్యక్తిగతంగా ఎదుర్కొంటానని వెల్లడించారు. తనపై లైంగిక ఆరోపణలు చేసిన జర్నలిస్ట్ ప్రియా రమణిపై ఆయన పరువు నష్టం కేసు వేశారు.

10/17/2018 - 16:58

జైపూర్: బీజేపీ నేత జస్వంత్ సింగ్ కుమారుడు మన్వీంద్ర సింగ్ బుధవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కాగా మన్వీంద్ర సింగ్ పార్టీని వీడటం వల్ల ఎటువంటి నష్టం లేదని రాజస్థాన్ మంత్రి రాజేంద్ర రాథోర్ పేర్కొన్నారు

10/17/2018 - 16:53

న్యూఢిల్లీ: శత్రు దేశాల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని భారత ఉత్తర కమాండో జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ అన్నారు. భారత్ ఒకసారి దాడి చేస్తే తాము పదిసార్లు దాడి చేస్తామని పాకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో రణబీర్ సింగ్ బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ భారత ఆర్మీ అన్నింటికీ పూర్తిగా సిద్ధంగా ఉందని అన్నారు.

10/17/2018 - 16:50

కేరళ : శబరిమల ఆలయంలోప్రవేశించేందుకు పోలీసుల సాయంతో కొండెక్కుతున్న ఇరువులు మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాధవి అనే నలభై సంవత్సరాల మహిళ ఒకరు. వీరు నిలక్కల్, పంబ వద్ద బారీకేడ్లను తోసుకుంటూ ముందుకు వెళుతుండగా.. ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. దీంతో మాధవి తన పిల్లలు, భర్తతో వెనుదిరిగింది.

10/17/2018 - 13:47

ఒడిశా: నువాపడా జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నువాపడా-కరీయార్ ప్రధాన రహదారిపై సిల్దా గ్రామ సమీపంలో లారీ, బొలెరో వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్‌ సహా 10 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌లోని మహసముంద్‌ జిల్లా కకరా ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు.

10/17/2018 - 12:37

శ్రీనగర్‌ : జమ్ము-కాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని ఫతే కదల్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం
జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక జవానుతో సహా ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు
తెలిపారు.

10/17/2018 - 12:26

కర్నూలు: కర్నూలు జిల్లా ఆలూరు మండల పరిధి పెద్దహోతూరు సమీపంలో ఇవాళ వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రాలీ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా..మరో 15 మంది తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు ట్రాలీ ఆటోలో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

10/17/2018 - 12:19

కేరళ: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలను లోపలకు అనుమతించబోమంటూ భారీ సంఖ్యలో ఆందోళనకారులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. శబరిమలకు ప్రధాన ప్రవేశద్వారమైన నిలక్కల్‌ (శబరిమలకు 20 కి.మీ. దూరం) వద్ద మహిళలు, బిజెపి సభ్యులు ఆందోళనలు చేస్తున్నారు. బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో, పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

10/17/2018 - 12:14

నీలక్కల్‌ : శబరిమల ఆలయంలోకి మహిళా భక్తుల ప్రవేశాన్ని నిరసనకారులు అడ్డుకుంటున్న క్రమంలో ఆలయ ప్రవేశ ద్వారం ఉన్న నీలక్కల్‌ పరిసర ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Pages