ఆంధ్రప్రదేశ్
కర్నాటక బస్సు ప్రమాదంలో ముగ్గురు అనంతవాసుల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అనంతపురం/తాడిపత్రి, మే 16: కర్నాటక రాష్ట్రం మంగళూరు సమీపంలోని ఘాట్రోడ్డులో మంగళవారం సాయంత్రం జరిగిన బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో హబీబా (50), మాబా ష(55), మహబూబ్బీ (42) ఉన్నారు. వీరంతా అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని రమేష్రెడ్డి కాలనీ, పడమటిగేరికి చెందిన 44 మంది ఆదివారం ఉదయం ఓ ప్రైవేటు బస్సులో కర్నాటక రాష్ట్రం మంగళూరులోని దాదాపహాడ్ దర్గా దర్శనానికి వెళ్లారు. దర్గాను దర్శించుకున్న అనంతరం మంగళవారం ఉదయం మంగళూరు మీదుగా ఉల్లాళ దర్గాకు బయలుదేరారు.
మంగళూరుకు ఐదు కిలోమీటర్ల సమీపంలోని ఘాట్రోడ్డులో వీరు ప్రయాణిస్తున్న బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ విషయాన్ని యాత్రికులకు తెలిపాడు. ఇంతలో బస్సు అదుపుతప్పి మలుపు వద్ద కొండను ఢీకొంది. దీంతో బస్సులోని హబీబా అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మాబాషను మంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వీరిద్దరూ భార్యాభర్తలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహబూబ్బీ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మంగళూరు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే పల్సాఘడీ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంగళూరు కలెక్టర్, ఎస్పీ బాధితులు పరామర్శించారు.
సిఎం, మంత్రుల దిగ్భ్రాంతి
మంగళూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పి రాజశేఖర్బాబుకు ఫోన్ చేసి మంగళూరు పోలీసులతో మాట్లాడాలని సూచించారు. దీంతో కలెక్టర్, ఎస్పీ మంగళూరు కలెక్టర్, ఎస్పీతో చర్చించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
చిత్రం..కర్నాటక రాష్ట్రం మంగళూరు సమీపంలో ఘాట్రోడ్డులో ప్రమాదానికి గురైన బస్సు