క్రీడాభూమి

ఆటగాళ్లతో గంగూలీ భేటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హడావుడిగా లండన్ వెళ్లి ఆటగాళ్లతో భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు ఇతర ఆటగాళ్లను కూడా అతను కలిశాడు. వారితో అతను జరిపిన చర్చల గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే, కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో, ఆ విషయంలోనే ఆటగాళ్ల అభిప్రాయాలను గంగూలీ సేకరించే అవకాశాలున్నాయి. కోచ్ ఎంపిక బాధ్యత గంగూలీ, సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న సలహా మండలిపై ఉంది. దరఖాస్తు చేసుకున్న వారిని వీరు ఇంటర్వ్యూ చేస్తారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని బిసిసిఐకి నివేదిక రూపంలో ఇస్తారు. వీరు ఎంపిక చేసిన వ్యక్తికి బిసిసిఐ ఆమోద ముద్రతో లాంఛనాలు పూర్తవుతాయి. పాలనా వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో, కోచ్ ఎంపికను కొత్త విధానంలో జరుపుతున్నారు. కుంబ్లే అదే పద్ధతిలో ఎంపికయ్యాడు. కొత్త కోచ్ ఎంపికకు కూడా అదే సూత్రాన్ని అనుసరిస్తారు.