ఆటాపోటీ

క్రికెట్ దౌత్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పదవిలో ఉండగా, 2005 ఏప్రిల్ 17న న్యూఢిల్లీ వచ్చాడు. భారత్, పాకిస్తాన్ జట్ల వనే్డ మ్యాచ్‌ని తిలకించడానికే తాను వచ్చినట్టు అతను ప్రకటించినప్పటికీ, కాశ్మీర్ వివాదంపై చర్చించాలన్నది అతని ఆంతర్యమనే వాదన బలంగా వినిపించింది. కానీ, అతని ప్రయత్నం ఫలించలేదు. అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి మ్యాచ్‌ని చూసినప్పటికీ, ఆయనతోగానీ, రాష్టప్రతితోగానీ చర్చలు జరిపే అవకాశమే అతనికి లభించలేదు. ఏదో సాధిద్దామని భారత్‌కు వచ్చి, ఉత్త చేతులతోనే అతను స్వదేశానికి తిరిగి వెళ్లాడు. మొత్తం మీద ముషారఫ్ క్రికెట్ దౌత్యం ఏ విధమైన ప్రయోజనాన్ని ఇవ్వలేకపోయింది.