రాష్ట్రీయం

వద్దంటే.. వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: నియోజకవర్గ ప్రజలు వద్దంటే ఆయా ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వొద్దన్న ఆలోచనలో తెరాస కనిపిస్తోంది. విజయం దక్కాలంటే జనంమాటే పార్టీ పాటగా ముందుకెళ్లాలన్న యోచనతో అడుగులేస్తోంది. ఈ ప్రాతిపదికన దాదాపు 20 నుంచి 30మంది ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆరు నెలలకు ఓసారి నిర్వహిస్తున్న సర్వేల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ఆయా నియోజకవర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. నియోజకవర్గంలో ప్రజలు సిఎం పనితీరుకు, పార్టీకి అనుకూలంగా స్పందిస్తున్నా, ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత చూపుతున్నారు. ఇలాంటి నియోజకవర్గాల్లో ఈసారి మార్పు తప్పదని తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో తెరాస తొలుత 63 స్థానాల్లో విజయం సాధించింది. తరువాత బిఎస్పీ సభ్యులు ఇద్దరు విలీనమయ్యారు. ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు, 12మంది తెదేపా సభ్యులు తెరాసలో విలీనమయ్యారు. కాంగ్రెస్ నుంచి ఐదుగురు చేరారు. అయితే ఇతర పార్టీల నుంచి చేరిన వారిలో కొందరు, తెరాస నుంచి గెలిచిన వారిలో కొందరిపట్ల సర్వేలో వ్యతిరేకత వ్యక్తమైంది. సిఎం కెసిఆర్ ఈ అంశాన్ని శాసన సభ్యులకు సూచనప్రాయంగా వెల్లడించారు. మీలో కొందరు పనితీరు మెరుగు పరుచుకోవాలి. సర్వేలో అనుకూలత వ్యక్తమైతేనే మళ్లీ అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. అదే ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అవసరాన్ని బట్టి కొందరు ఎమ్మెల్యేలను ఈసారి పార్లమెంటుకు పోటీ చేయించనున్నారు. ఒకరిద్దరు ఎంపీలను శాసనసభకు పంపించే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉంది. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ అంశాన్ని గత సమావేశంలోనే కెసిఆర్ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడినప్పుడూ ఈ అంశాన్ని వివరించారు. పార్టీ నిర్వహిస్తున్న సర్వేల్లో 106 నుంచి 111 నియోజక వర్గాల్లో విజయం సాధిస్తోందని తేలింది. అయితే అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో సిఫారసులను పట్టించుకోకుండా స్థానికంగా ఉన్న పలుకుబడిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఇదే విధంగా శాసనసభ ఎన్నికల్లోనూ నియోజకవర్గంలో వ్యక్తమైన అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ నెలరోజుల్లో ప్రారంభమవుతుందనే అంచనాలో తెరాస నాయకత్వం ఉంది. కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే విభజన చట్టంలో పేర్కొన్న విధంగా నియోజకవర్గాల సంఖ్య 2019 ఎన్నికల నాటికి పెరుగుతాయి. నియోజకవర్గాల సంఖ్య పెరిగినా, ఇదేవిధంగా ఉన్నా కొందరు ఎమ్మెల్యేలను మార్చాలనే ఆలోచన మాత్రం పార్టీ నాయకత్వానికి బలంగాఉన్నట్టు తెలుస్తోంది. రైతుల్లో, కుల వృత్తుల వారిలో, ఉద్యోగులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్న వారి మద్దతు పార్టీకి ఉంటుందని, వీటితో పార్టీ విజయం సాధిస్తుందని, అయితే అభ్యర్థుల ఎంపికకు సైతం పార్టీ నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.