జాతీయ వార్తలు

రాష్టప్రతి, ప్రధాని అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: మార్క్3 ప్రయోగం విజయవంతం కావటంపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన విజయం సాధించినందుకు భారత శాస్తవ్రేత్తలను వారు అభినందించారు. ‘2002 నుంచి ఈరోజు విజయం కోసం ప్రతి నిత్యం అహరహం శ్రమించిన శాస్తవ్రేత్తల బృందాన్ని నేను మన:స్ఫూర్తిగా అభినందిస్తున్నాను.’’ అని రాష్టప్రతి వ్యాఖ్యానించారు.
మార్క్ 3 విజయానికి అంకితభావంతో కృషి చేసిన శాస్తవ్రేత్తలకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా శాస్తవ్రేత్తలకు అభినందనలు తెలిపారు.
ఇస్రో బాహుబలి
స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ తపన్ మిశ్రా స్పందిస్తూ మార్క్ 3ని ఒక బాహుబలిగా అభివర్ణించారు. ‘‘ ఇస్రో ఓ బాహుబలికి జన్మనిచ్చినందుకు గర్వపడుతున్నాను’’ అని అన్నారు. మరికొందరు శాస్తవ్రేత్తలు మార్క్ 3ని ‘వినయవిధేయతలు కలిగిన బాలుడు’ అని, అతి భారీ రాకెట్‌గా పేర్లు పెట్టారు.