వరంగల్

చెక్కులు పంపిణీ చేసిన మంత్రి చందులాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, జూన్ 8: మంగపేట మండలంలోని చుంచుపల్లిలో చెంచులక్ష్మి ఎస్టీ ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ కో ఆపరేటివ్ సొసైటీ సభ్యులకు గురువారం రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ చెక్‌లు పంపిణీ చేశారు. ఇసుక క్వారీ ద్వారా ఆదాయం వచ్చిన రూ.16.56 లక్షలకు సంబందించిన చెక్‌లను మంత్రి చందులాల్ పంపిణీ చేశారు. సొసైటీలోని 279 మంది లబ్ధిదారులకు గానూ గురువారం 184 మందికి చెక్‌లు పంపిణీ చేసినట్లు, మిగిలిన వారికి మరో రెండు రోజులలో చెక్‌లు పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్బంగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అజ్మీరా చందులాల్, మహబూబాబాద్ ఎంపి అజ్మీరా సీతారాం నాయక్, ఐటిడిఏ పిఓ చక్రధరరావు,మంగపేట జడ్పీటీసీ సిద్దంశెట్టి వైకుంఠం, ఐకెపి ఏపిడి నూరిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.