చిత్తూరు

ఆటోను ఢీకొన్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, జూన్ 8: కల్లూరు-పీలేరు జాతీయ రహదారి చెరుకువారిపల్లి సమీపంలో గురువారం ఉదయం ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందగా మరొక రైతుకుతీవ్రగాయాలై పరిస్థితి విషమంగా ఉన్నట్లు కల్లూరు ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు. కల్లూరు ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల మేరకు పీలేరు మండలం దొడ్డిపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లికి చెందిన సుబ్బారెడ్డి(66), రేగళ్ల పంచాయతీ నగిరి ఇండ్లుకు చెందిన మునిరాజు(46), రేగళ్ల పంచాయతీ కూరపర్తివారిపల్లికి చెందిన రఘునాథరెడ్డి( 50) రేగళ్ల పంచాయతీ బోయపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం ఆటోలో గురువారం వేకువజామున టమోటాలు వేసుకొని కల్లూరు మార్కెట్‌లో అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. చెరుకువారిపల్లి బస్టాప్ సమీపంలో ఆటోలో వెళ్తుండగా పీలేరు వైపునుండి చిత్తూరుకు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జు కావడంతో ఆటోలో వెళ్తున్న సుబ్బారెడ్డి, మునిరాజు అక్కడికక్కడే మృతి చెందారు. రఘునాధరెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆటోడ్రైవర్ సుబ్రహ్మణ్యం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలైన రఘునాథరెడ్డిని పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రున్ని తిరుపతి రుయాకు తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన సుబ్బారెడ్డి, మునిరాజు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.