రంగారెడ్డి

భక్తిశ్రద్ధలతో బంగారు మైసమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 9: రామంతాపూర్ ఆర్టీసీ కాలనీలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ ఆలయ 10వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో కన్నుల పండువగా జరిగాయి. ఆలయ చైర్మన్ పసుల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా హోమాలు, పూర్ణాహుతి, అర్చనలు, తీర్థప్రసాదాలు నిర్వహించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, కార్పొరేటర్లు బి.స్పప్న, జి.జ్యోత్స్న, ఎం.అనలా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేకల శివారెడ్డి, దుబ్బ నర్సింహారెడ్డి, షేక్ బుడేసాహెబ్, ఉద్దమర్రి నర్సింహారెడ్డి, డిప్యూటీ కమిషనర్ విజయకృష్ణ, ప్రముఖులు ఇనుకొండ నర్సింహారెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఎం.ఆనంద్, బి.ఎన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సురేష్, జగదీష్, నగేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ప్రముఖులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.