అనంతపురం
బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్కు నిధులు మంజూరు చేయాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అనంతపురం కల్చరల్, జూన్ 11: రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్కు ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు రూ.75 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయించాలని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షులు భాస్కర తారానాథశర్మ, అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈమేరకు టౌన్క్లబ్లో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్పొరేషన్కు రూ.500 కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, మూడేళ్లయినా ఇప్పటివరకు రూ.135 కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు 13 జిల్లాల్లోను కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు సతీష్శర్మ, ఎవికె.మోహన్, ఎ.మధుసూధన శర్మ, ఎస్.హనుమంతరావు పాల్గొన్నారు.