చిత్తూరు
సెల్ టవర్ ఎక్కి మతిస్థిమితంలేని వ్యక్తి హల్చల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రేణిగుంట, జూన్ 12: స్థానిక రైల్వేక్వార్టర్స్లోని సెల్టవర్ ఎక్కి మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేసిన సంఘటన సోమవారం ఉదయం రేణిగుంటలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే హైదరాబాద్కు చెందిన సాయికుమార్ (20) గత కొంత కాలంగా మతి స్థిమితం లేకుండా రైల్వేక్వార్టర్స్లో సంచరిస్తున్నాడు. సోమవారం ఉదయం 4 గంటలకు రైల్వేక్వార్టర్స్లోని రైల్వే టెలికం సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేస్తుండగా క్వార్టర్స్లో నివాసం ఉంటున్న స్థానికులు గమనించి పోలీసులకు తెలియజేశారు. దీంతో రైల్వేపోలీసులు, అర్బన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సెల్ టవర్పై ఉన్న మతి స్థిమితం లేని వ్యక్తిని కిందకు దించేందుకు విఫలయత్నం చేశారు. రైల్వేస్టేషన్లో ఉన్న బాబు అనే వ్యక్తి సాహసించి సెల్టవర్పైకెక్కి మతి స్థిమితం లేని వ్యక్తికి మంచి మాటలు చెప్పి కిందకు తీసుకువచ్చి దించాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించారు. మతిస్థిమితం లేని వ్యక్తిని కిందకు దించిన బాబును పోలీసులు, పలువురు అభినందించారు.