ఖమ్మం
356 కోట్లతో అభివృద్ధి పనులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఖమ్మం, జూన్ 12: రాష్ట్రంలోనే ఖమ్మం మోడల్ నగరంగా రూపుదిద్దుకుంటుందని, ఈ నెల 15న 356 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్ శ్రీకారం చుట్టనున్నారని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కార్పొరేషన్లలో ఖమ్మం అగ్రస్థానంలో ఉందన్నారు. 229కోట్లతో ఇంటింటికి తాగునీటి పథకాన్ని ప్రారంభించామని, 2018నాటికి ఆ పనులు పూర్తి అవుతాయన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసే ఐటిహబ్కు శంకుస్థాపన రోజే 15కంపెనీల కార్యకలాపాలకు అనుమతులు కూడ మంజురు చేస్తున్నట్లు వెల్లడించారు. 350పడకలుగా ఉన్న ఖమ్మం ప్రభుత్వసుపత్రిని 500పడకలకు పెంచుతున్నామన్నారు. ఖమ్మం నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే అమృత్ నిధులతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా 200కోట్ల రూపాయలను మంజురు చేసిందన్నారు. వీటికి తోడు 12.5కోట్లతో ఐటిహబ్, 77కోట్లతో ద్వంసలాపురం బ్రిడ్జ్ నిర్మాణం లాంటివి కూడా వచ్చాయన్నారు. భక్తరామదాసు కళాక్షేత్రాన్ని 1.10 కోట్లతో ఆధునికరించామన్నారు. ఖమ్మం నగరాన్ని గతంలో ఏ శాసన సభ్యుడు చేయని విధంగా కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తుంటే కొందరు ఆరోపణలు గుప్పించటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. మనుగడ కోసం కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు తిప్పికొడుతున్నారన్నారు. వచ్చే 2ఏళ్ళలో ఖమ్మం నగరం అభివృద్ధి చెందిన నగరాల జాబితాలో చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదిన కెటిఆర్ ఐటిహబ్, నూతన బస్టాండ్లకు శంకుస్థాపన చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మేయర్ పాపాలాల్, డిప్యూటి మేయర్ మురళి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.