ఆంధ్రప్రదేశ్‌

ఐవైఆర్‌పై అసభ్యకర పోస్టింగ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై సోషల్ మీడియాలో వచ్చిన అసభ్యకర పోస్టింగ్‌లపై బ్రాహ్మణ సంఘాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలే ఈ పోస్టింగ్‌లు పెట్టినట్టు ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈమేరకు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వచ్చి డిజిపికి ఫిర్యాదు చేశారు. అంతటి పెద్ద వ్యక్తిని అగౌరపరుస్తూ ఆత్మగౌరవం దెబ్బతినేలా నీచాతి నీచంగా పోస్టింగ్‌లు పెట్టిన వ్యక్తులపై, వెబ్‌సైట్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తక్షణమే వెబ్‌సైట్‌లను, పోస్టింగ్‌లను నిలిపి వేసి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని విఙ్ఞప్తి చేశారు. డిజిపి లేనందున ఐజి మీనాను కలిసి ఫిర్యాదు పత్రం సమర్పించారు. ఫిర్యాదు చేసినవారిలో మాజీ శాసన సభ్యులు మల్లాది విష్ణు, జగన్మోహనరాజు, ద్రోణంరాజు రవికుమార్, జింకా చక్రధర్, చల్లా విజయ్‌కుమార్, టి లక్ష్మణరావు, తదితరులు ఉన్నారు.