బిజినెస్
జూలై 20లోగా డిపాజిట్ చేయండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, జూన్ 21: రద్దయిన పాత పెద్ద నోట్ల డిపాజిట్ కోసం జిల్లా సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, తపాలా కార్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే.
ఈ క్రమంలో కొత్త 500, 2,000 రూపాయల నోట్లను తెస్తున్నట్లు వెల్లడించిన మోదీ.. రద్దయిన నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని, అంతే విలువైన కొత్త నోట్లను, ఇతరత్రా చిన్న నోట్ల (100, 50, 20, 10 తదితర)ను పొందవచ్చని స్పష్టం చేశారు.
ఇలా బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిసెంబర్ 30 వరకు డిపాజిట్ చేసుకునే వెసులుబాటును కేంద్రం ప్రజలకు కల్పించింది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 31 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కార్యాలయాల్లో నోట్ల మార్పిడికి అవకాశం ఇచ్చింది.
అయితే డిపాజిట్ల రూపంలో వచ్చిన రద్దయిన పాత పెద్ద నోట్లను రిజర్వ్ బ్యాంక్కు పంపించడానికి బ్యాంకులకు, పోస్ట్ఫాసులకు కూడా కేంద్రం గడువు విధించింది. అయితే అలా మిగిలిపోయిన నోట్లు బ్యాంకులు, పోస్ట్ఫాసుల వద్దే ఉండిపోగా, ఇప్పుడు వచ్చే నెల 20 వరకు ఆ నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని బ్యాంకులు, పోస్ట్ఫాసులకు కేంద్రం ఓ అవకాశాన్నిచ్చింది.
కాగా, సహకార బ్యాంకుల్లో నోట్ల మార్పిడి సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూడటంతో నిరుడు నవంబర్ 14 వరకే అక్కడ నోట్ల మార్పిడికి కేంద్రం అవకాశమిచ్చినది తెలిసిందే.
ఇక నిరుడు నవంబర్ 8 నాటికి చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ 17.7 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో రద్దయిన 500, 1,000 రూపాయల నోట్లూ ఉండగా, అవే దాదాపు 90 శాతం వరకు ఉంటాయని అంచనా. నిరుడు డిసెంబర్ 13న ఆర్బిఐ వెల్లడించిన వివరాల ప్రకారం డిసెంబర్ 10 వరకు డిపాజిట్ అయిన పాత పెద్ద నోట్ల విలువ 12.44 లక్షల కోట్ల రూపాయలు.