అదిలాబాద్

ఆశా వర్కర్లకు అండగా ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, జూన్ 22: అశా వర్కర్లకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం మంత్రి రామన్న నివాసంలో సిఐటియు అనుబంధ సంస్థలో పని చేస్తున్న అశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షులు మమత అధ్వర్యంలో వంద మంది అశావర్కర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ అశావర్కర్ల వేతనాలు పెంచడం జరిగిందన్నారు. అదేవిధంగా సీనియార్టి ప్రకారం ఆశావర్కర్లను రెండవ ఎఎన్‌ఎంలుగా పదోన్నతులు కల్పిస్తామని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు అశావర్కర్ల సమస్యలను పట్టించుకోలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష సేవలందిస్తూ అశావర్కర్లకు తగిన గుర్తింపునివ్వడంతో పాటు వారికి గౌరవేతనాలు పెంచడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆరె రాజన్న, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు బండారి సతీష్, దేవన్న, రాజు, సత్యనారాయణ, ఆశమ్మ తదితరులు పాల్గొన్నారు.