కృష్ణ

త్రోబాల్ క్రీడాకారులకు అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 22: నేపాల్‌లోని కాట్మాండ్‌లో ఈ నెల 15 నుండి 18వరకు జరిగిన ప్రపంచస్థాయి గేమ్స్‌లో భారత త్రోబాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రాష్ట్ర క్రీడాకారులను ఆంధ్రపదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బంగార్రాజు అభినందించారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని శాప్ కార్యాలయంలో క్రీడాకారులను ప్రత్యేకంగా ఎండి అభినందించారు. అంతకుముందు జరిగిన అభినందన కార్యక్రమంలో శాప్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్‌వి రమణ, డిఎస్‌డిఒ బి శ్రీనివాసరావు, స్పోర్ట్స్ ఆఫీసర్ రవీంద్ర, రాష్ట్ర త్రోబాల్ సంఘ కార్యదర్శి ఇ సులోచన, చైర్మన్ పి సత్యనారాయణ రాజు, శాప్ ఒఎస్‌డి పి రామకృష్ణ, అప్పారావులు పాల్గొని అభినందించారు. మహిళల విభాగంలో యు పూజిత, శ్రేయభూపతి, పురుషుల విభాగంలో పి రేవంత్, కె పౌల్‌దేవసిలు భారతజట్టుకు జిల్లా నుండి ప్రాతినిథ్యం వహించి బంగారు పతకాలను సాధించారు.