గుంటూరు

కృష్ణారావు తొలగింపు బ్రాహ్మణులను అవమానించడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, జూన్ 22: సీనియర్ ఐఎయస్ అధికారి, మాజీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి బ్రహ్మణ కార్పొరేషన్ అధ్యక్షులు అయిన ఐవై ఆర్ కృష్ణారావును ఆయనకు తెలియకుండానే పదవీచ్యుతుడ్ని చేయడం రాష్ట్రంలో వున్న బ్రాహ్మణులందరిని అవమానించడమేనని సత్తెనపల్లి వైకాపా పట్టణ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండవరపు అమర్‌నాధ్ అన్నారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంవత్సరానికి రూ. 500 కోట్లు ఇస్తున్నామని ప్రకటించినప్పటికీ అధికారంలోకి వచ్చినాక రూ.125 కోట్లు మాత్రమేనని వివరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గావున్న కృష్ణారావు సియం చంద్రబాబునాయుడ్ని కలిసేందుకు మూడుసార్లు అపాయింట్‌మెంట్ కోరినప్పటికి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం బ్రాహ్మణులను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. అసభ్యకరమైన పోస్టింగులు టిడిపి సోషల్ మీడియా వెబ్‌సైట్‌లో పెట్టిన వారిపై కేసు బనాయించి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.