విశాఖ

మీకు న్యాయం జరిగేలా చూస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 22: సమస్యల పరిష్కారం కోసం గత కొద్ది రోజులుగా నిరసన తెలుపుతున్న అర్చకులకు వైకాపా నేత జగన్‌మోహన రెడ్డి సంఘీభావం తెలిపారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద మహాధర్నాలో పాల్గొన్న అనంతరం జగన్‌ను అర్చకుల సంఘం ప్రతినిధులు కలిశారు. తొలుత జగన్ అర్చకులు దీక్ష చేసే ప్రాంతానికే వెళ్లి సంఘీభావం తెలపాలనుకున్నప్పటికీ, భద్రతా కారణాల రీత్యా సాధ్యం కాలేదు. దీంతో జగన్ వద్దకే అర్చకులు వచ్చి తమ ఆవేదన పంచుకున్నారు. గత నెల రోజులుగా తాము సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నామని, కనీసం తమ పట్ల సానుకూలత చూపలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. దీనిపై స్పందించిన జగన్ మీ సమస్యల పరిష్కారం కోసం తాను మాట్లాడుతానని హామీ ఇచ్చారు.