పశ్చిమగోదావరి

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, జూన్ 22: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక పథకాలను చేపడుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 13 మసీదుల అభివృద్ధికి ఒక్కొక్క మసీదుకు రూ.15వేలు ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో మంత్రి జవహర్ మసీదు నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతేడాది మసీదుల అభివృద్ధికి రూ.10వేలు చెల్లించినట్టు చెప్పారు. కులమతాలకు అతీతంగా సిఎం చంద్రబాబునాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ముస్లిం సోదరులు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల అవగాహన కల్గించుకుని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గురువారం సాయంత్రం స్థానిక మసీదులో జరిగిన కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి మంత్రి జవహర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి జవహర్ మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.