రంగారెడ్డి

కంట్లో నకిలీ కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూన్ 22: నకిలీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్న ఓ కంపెనీపై శంషాబాద్ ఎస్‌వోటి పోలీసులు.. మైలార్‌దేవ్‌పల్లి పోలీసుల సహకారంతో దాడి చేసి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ రాజన్నబావి ప్రాంతానికి చెందిన చందర్.. పల్లెచెరువు సమీపంలో ఓ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నాడు. ఫ్యాక్టరీలో నకిలీ కారంపొడి, గరం మసాలా, కుంకుమలను తయారు చేస్తున్నట్లు శంషాబాద్ ఎస్‌వోటి ఎస్సై శ్రీనివాస్‌రెడ్డికి విశ్వసనీయ సమాచారం అందింది. గురువారం మైలార్‌దేవ్‌పల్లి పోలీసుల సహకారంతో కంపెనీపై దాడి చేశారు. నకిలీ కారంపొడి, కుంకుమ, గరం మసాలాలను తయారు చేసి వివిధ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు తేల్చారు. రూ.10 లక్షల విలువ చేసే ముడి సరుకులు, నకిలీ సరుకును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.