కృష్ణ

పథకాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటర్), జూన్ 23: మత్స్య శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను జూలై నెలాఖరు నాటికి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్-2 బి మార్కండేయులు ఆదేశించారు. శుక్రవారం ఆయన తన ఛాంబర్‌లో మత్స్య శాఖాధికారులతో మాట్లాడారు. మత్స్య శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాల తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. సబ్సిడీపై బోట్లు, వలలు, ఇతరత్రా ఉపకరణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.