కృష్ణ

పట్టణంలో ఏ ఒక్క పంది కనిపించినా చంపేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 23: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పట్టణంలో ఏ ఒక్క పంది కనిపించినా చంపేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ స్పష్టం చేశారు. పందుల పెంపకంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గురువారం పురపాలక సంఘ సమావేశ మందిరంలో పట్టణంలోని పందుల పెంపకందార్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పందుల పెంపకాన్ని పట్టణానికి దూరంగా ఫెన్సింగ్ చేసి ఖాళీ స్థలంలో చేపట్టాలన్నారు. అలా కాకుండా నివాస ప్రాంతాల్లో పందులు పెంచుతున్నట్లు తెలిస్తే వాటిని పట్టుకుని చంపేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ జస్వంతరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ప్రజా ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.