హైదరాబాద్

బ్లాక్ మెయిల్ కేసులో నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్, జూన్ 23: లవ్ ఎఫైర్ పేరుతో ఓ యవతిని మోసం చేసిన ఇద్దరు అలరిమూకలను శుక్రవారం సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాలను శుక్రవారం సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఐ లింగయ్య వెల్లడించారు. గ్రీన్ పార్క్ కాలనీ కర్మన్ ఘాట్ ప్రాంతానికి చెందిన పులి వసంతకుమార్ (19), యాకత్‌పుర ప్రాంతానికి చెందిన సునేహ్రా రిషిరాజ్ (19) ఇద్దరు ఒకే కాలేజ్‌లో ఇంటర్ చదువుకున్నారు. రిషిరాజ్ అనే యువకుడు వసంతకుమార్‌కు సీనియర్. వసంతకుమార్.. సహ విద్యార్థినికి వేరే వ్యక్తులతో లవ్ ఎఫైర్ ఉందని అది అందరికీ చెబుతామని పలుమార్లు బ్లాక్ మెయిల్ చేశారు.
అంతటి ఆగకుండా వీరిద్దకీ జల్సాలకు ఎప్పుడు డబ్బు అవసరమున్న ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు. ఆమె వద్ద ఉన్న 12.5 తులాల బంగారు ఆభరణాలను తీసుకొని మణప్పురం గోల్డ్ లోన్‌లో, ముసారాంబాగ్‌లోని ఆర్‌ఎస్ రాజ్ పాన్‌బ్రోకర్ వద్ద తనఖా పెట్టారు. విషయం తెలుకున్న తండ్రి.. ఆమెను నిలదీయగా విషయం బయట పడింది. సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి నిందితుల వద్ద 12.5 తులాల బంగారు ఆభరణాలు, ఒక మోటర్ సైకిల్, ఒక గిటార్‌ను స్వాధీన పర్చుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.