భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! 66

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ కార్యక్రమం ముగిసాక గుడిలో స్వామిని దర్శించి కొబ్బరికాయలు కొట్టి, వావరు గుడికి ప్రదక్షిణలు చేస్తారు! స్వామి ఆదేశం ప్రకారం వావర్ తమ వెంట అరణ్యమార్గంలో తోడుగా వుండి ప్రమాదాలు సంభవించకుండా చూస్తాడన్న విశ్వాసంతో అక్కడనుండి ముందుకు సాగి ‘పేరూరు తోడు’ అనే నదీ ప్రాంతాన్ని చేరుకుంటారు! ఆ నది భక్తులు స్నానం ఆచరించడానికి వీలుగా కొండలమీది నుండి క్రిందకు ప్రవహిస్తూ ఉంటుంది! ఇక్కడ స్నానాలు చేసి శుభ్ర వస్త్రాలు ధరించి భక్తులు ‘కాళైకట్టె’ ప్రాంతాన్ని చేరుకుంటారు!
కాళైకట్టె: ఆ ప్రాంత భాష అయిన మలయాళంలో ‘కాళై’ అంటే వృషభం అనీ, కట్టె అంటే కట్టివేయటం అనీ అర్థం!
మణికంఠుడు మహిషిని మర్దించే సమయంలో చూడటానికి వచ్చిన పరమేశ్వరుడు ఈ స్థలంలోనే తన నంది వాహనాన్ని కట్టివేసినట్లు ఇక్కడి స్థల పురాణం తెలుపుతున్నది! ఇక్కడ వున్న పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, నాగరాజుల గుడులను దర్శించుకుని భక్తులు అక్కడికి దగ్గరలో వున్న అళుదానది దగ్గరకు చేరుకుని రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు! వంట చేసుకుని తిని రాత్రంతా భజన చేస్తూ గడుపుతారు!
అళుదానది:ఇది ఒక చిన్న జలప్రవాహం! మహిషిని సంహరించడానికి మణికంఠుడు ఆమె శరీరాన్ని మర్దిస్తున్నపుడు జ్ఞానోదయమై తనకు క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకుంటూ విషాదంతో కన్నీరు కారుస్తుంది మహిషి! ఆ కన్నీరే అళుదా (కన్నీళ్ళు) నదిగా ఏర్పడిందని స్థల పురాణం తెలిజేస్తున్నది. వనమూలికలు, ఔషధాల సారం గల ఈ అళుదానది నీటిలో స్నానం దేహానికి ఆరోగ్యాన్ని, మనస్సుకు శాంతిని ప్రసాదిస్తాయి.
ఈ నదీ ప్రాంతంలోనే ఉదయనుడనే గజదొంగను చంపడానికి సైన్యాలతో బయలుదేరిన అయ్యప్ప విడిది చేసినట్లు కూడా జానపదగాథలలో తెలుపబడింది.
మర్నాడు పొద్దున అళుదా నదిలో స్నానం చేసి ఆ నదిలో నుండి రెండు రాళ్లను తీసుకుని వాటితో రెండవ రోజు ప్రయాణం మొదలుపెడతారు భక్తులు!
రెండవ రోజు ప్రయాణం:అళుదానదీ స్నానం ముగించుకుని, అందులో నుండి రెండు రాళ్లు ఏరుకుని భద్రపరచుకుని అళుదామేడు అనే కొండ ప్రాంతాన్ని చేరుకుంటారు యాత్రికులు!
అళుదామేడు:మేడు అంటే కొండ! సుమారు 5 కి.మీ ఎతె్తైన గుండ్రని రాళ్ళతో కూడిన ఈ కొండను శరణుఘోష చెప్పుకుంటూ ఎక్కుతారు యాత్రికులు. ఈ కొండ శిఖరానికి కొంచెం క్రిందగా ‘కళ్లడుంకుండ్రు’ అనే ప్రదేశం ఉన్నది!
కళ్లడుంకుండ్రు: మహిషిని వధించి, ఆ శరీరాన్ని ఆకాశంపైకి విసురుతాడు మణికంఠుడు! ఆ కళేబరం వచ్చి భూమిపై పడ్డ స్థలమే ఈ ‘కళ్లడుంకుండ్రు’గా స్థల పురాణంలో తెలుపబడింది! దేవతలు మహిషి కళేబరం మీద అళుదానది నుండి తీసిన రాళ్ళు విసిరి ఆ స్థలంలో సమాధి గావించారుట. అందుకు గుర్తుగా భక్తులు అళుదానది నుండి ఏరుకుని తెచ్చిన రెండేసి రాళ్లను ఆ ప్రదేశంలో వుంచడం ఆచారంగా మారింది! అక్కడ కర్పూర హారతులు ఇచ్చి నమస్కరించి ముందుకు సాగుతారు!
ఇంజిపారకోట:అళుదామేడు శిఖరాన్ని ఇంజిపారకోట అంటారు! పూర్వం ఉదయనుడి కోట వుండిన స్థలంగా ఈ ప్రదేశం చెప్పబడింది! ఇక్కడే అయ్యప్పస్వామి ఉదయనుడిని హతమార్చటం జరిగింది! ఇక్కడ నీరు చిన్న కాలువగా ప్రవహిస్తూ ఉండటంవల్ల భక్తులు కొంతసేపు విశ్రమించి కొండదిగటం ప్రారంభిస్తారు! శరణుఘోష చెప్పుకుంటూ ‘కరిమలతోడు’ అనే ప్రదేశాన్ని చేరుకుంటారు!
కరిమలత్తోడు:కరి అంటే ఏనుగు, మల అంటే కొండ, తోడు అంటే నీరు! ఈ ప్రాంతమంతా ఏనుగులతో నిండి వుండటంవల్ల ఈ కొండ ప్రాంతానికి ‘కరిమల’ అనే పేరు వచ్చింది! ఇక్కడి పిల్లకాలువలలో నీరు ప్రవహిస్తూ వుండటంవల్ల ఏనుగులు ఈ కాలవల దగ్గరకు వస్తుంటాయి. ఇక్కడ నీరు పాత్రలతో నింపుకుని నిటారుగా వున్న కొండను ఎక్కటం ప్రారంభిస్తారు భక్తులు! సుమారు పది కి.మీ పైకి ఎక్కి వెళ్లి కొండ శిఖరం చేరుకుంటారు! ఈ కొండ శిఖరాన్ని ‘కరిమల ఉచ్చ’ అని పిలుస్తారు. ఇక్కడ ఒక దివ్యమైన బావి, జలపాతం దర్శనమిస్తాయి! బావిలో నీరు ఎప్పుడూ వూరుతూనే వుండటం ఆశ్చర్యకరంగా భావించబడుతున్నది! వాటికి పసుపు, కుంకుమలు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి నమస్కరించి అక్కడ ఏర్పరచిన హుండీలో డబ్బులు సమర్పించి నమస్కరిస్తారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు! బస చేసే స్థలాలను ‘తావళం’ అంటారు!
మూడవ రోజు ప్రయాణం:మూడవ రోజు ఉదయానే్న భక్తులు కరిమలఉచ్ఛనుండి దిగటం ప్రారంభిస్తారు. ఈ కొండ దిగటం కూడా ఎంతో కష్టం! అయినా అయ్యప్ప శరణు ఘోష చెప్పుకుంటూ దిగి పెరియాన పట్టం అనే ప్రదేశాన్ని చేరుతారు.
పెరియాన పట్టం:పెరి అంటే పెద్ద, యాన అంటే ఏనుగు, పట్టం అంటే స్థలం అని అర్థం మలయాళ భాషలో! ఇక్కడ ఒక కాలువలో నీరు ప్రవహిస్తుంటుంది.
-ఇంకాఉంది