హైదరాబాద్
గోల్డ్స్టోన్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 25 June 2017
శంషాబాద్, జూన్ 24 గోల్డ్స్టోన్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని ఘాన్సిమియాగూడ గ్రామంలో గోల్డ్స్టోన్ సంస్థ కోనుగోలు చేసిన భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు, రైతులకు పంపణీ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత రైతులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు సిపిఎం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సిపిఎం కార్యదర్శి కె.్భపాల్, నాయకులు రాంచందర్, యాదయ్య, జగన్, మల్లేష్, సత్యనారాయణరెడ్డి, దర్శన్, జైపాల్రెడ్డి, రుద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.