హైదరాబాద్

పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, జూన్ 24: కంటోనె్మంట్ లో పేదలందరికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయస్తామని కంటోనె్మంట్ ఎమ్మెల్యే జి. సాయన్న చెప్పారు. శనివారం కంటోనె్మంట్ మూడవ వార్డులోని గాంధీనగర్, శ్రీరాంనగర్ కాలనీలో నిర్మించనున్న 336 మంది లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను అందజేశారు. ఇప్పటికే బస్తీలలో రెవిన్యూ అధికారులు సర్వే చేశారనీ దాని ప్రకారం నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు అందే విధంగా ఛర్యలు తీసుకుంటామనీ.. ఇందులో కోందరు శాశ్వత నిర్మాణాలు చేసిన వారు ఉన్నారనీ, ఇళ్ల పట్టాలు ఉండి ఇంటికి తాళం వేసి గ్రామాలకు వెళ్లిన వారు ఉన్నారనీ అన్ని రకాలైన లబ్ధిదారులను ఒప్పించి వారికి ఇండ్ల నిర్మించటానికి చర్యలు తీసుకుంటున్నామనీ రాష్ట్ర ప్రభుత్వం జంటనగరాల్లోని అన్ని మురికి వాడలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మించాలనీ నిర్ణయించిందనీ అందులో భాగంగానే కంటోనె్మంట్‌లోని రెండవ వార్డులో సిల్వర్ కంపెణీ వద్ద రెండు వందలపైచిలుకు ఇళ్లు నిర్మించటానికి పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు.