అదిలాబాద్
రూ.5 కోట్లతో విశ్రాంతి భవన నిర్మాణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఉట్నూరు, జూన్ 25: ఉట్నూరు ఐబి చౌరస్తాలోని ఆర్అండ్బి స్థలంలో రూ.5కోట్ల నిధులతో విశ్రాంతి భవనం నిర్మించనున్నామని మాజీ ఎంపి, తెరాస నేత రాథోడ్ రమేష్ తెలిపారు. ఆదివారం భవన నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సుద్దగూడ గ్రామ ప్రజలు మాజీ ఎంపి రాథోడ్ రమేష్ను సన్మానించారు. ఈసంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత కొంత కాలంగా ఆర్అండ్బి స్థలంలో పిచ్చిమొక్కలు నిండి వెక్కిరిస్తున్నాయని, ఇక్కడ విశ్రాంతి భవనంతో పాటు ఆర్అండ్బి అధికారులు వసతి గృహాలను నిర్మించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దృష్టికి తీసుకరాగా ఆయన రూ.5కోట్లు మంజూరి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా అభివృద్దే ధ్యేయంగా తాను తెరాస పార్టీలో చేరానని, పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటూ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. ప్రజలు సైతం సమస్యలు లేకుండా జీవించాలన్నదే తన ఆశ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.