అదిలాబాద్
27న నీటి పారుదల సలహా బోర్డు సమావేశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 25 June 2017
మంచిర్యాల, జూన్ 25: ఈ నెల 27 మంచిర్యాల జిల్లా నీటి పారుదల సలహా బోర్డు సమావేశం జిల్లా పాలన అధికారి సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లుగా నీటి పారుదల శాఖ అధికారి విష్ణు ప్రసాద్ తెలిపారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల ప్రకారం భారీ మధ్య తరహా చిన్న నీటి పారుదల ప్రాజెక్ట్ల నుంచి 2017-18 ఖరీఫ్ పంటలకు నీరు విడుదల చేయుటకు ఆయకట్టు ప్రతిపాదనల నిర్ణయం కొరకు సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని మంత్రులతో పాటు ఎంపి, జిల్లా పరిషత్ చైర్మన్, శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, జిల్లా అధికారులు హాజరవుతున్నారని తెలిపారు.