మెదక్

ఆలయాల అభివృద్ధికి రూ.90లక్షలు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 25: జిల్లాలోని వివిధ దేవాలయాల అభివృద్ధికి 90లక్షలు మంజూరైనట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఆదివారం ఫోన్‌లో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ పురాతన ఆలయాల్లో పునరుద్దరణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామీం ప్రాంతాల్లోని కుల సంఘాల ఇలవేల్పు గ్రామదేవతల ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ ద్వారా కామన్‌గుడ్ ఫండ్ కింద ప్రత్యేక నిధులు మంజూరు చేశారన్నారు. నియోజకవర్గంలోని పుల్లూరు పెద్దమ్మగుడి, బక్రిచెప్యాల పెద్దమ్మగుడి, నాంచారుపల్లి నల్లపోచమ్మ, ఎన్సాన్‌పల్లి హనుమాన్, ఎల్లుపల్లి హనుమాన్, కొండపాక మండలం మంగోల్, హుస్నాబాద్ నియోజకవర్గంలో పోతారం పెద్దమ్మగుడి , ఉమ్మాపూర్ హనుమాన్ దేవాలయాలకు నిధులు మంజూరైనాయని, ప్రతి గుడికి 10లక్షల చొప్పున నిధులు మంజూరైనాయన్నారు. త్వరలోనే టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారన్నారు.