విజయనగరం

జవహర్ నవోదయలో కలెక్టర్ సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.కోట,జూన్ 25: మండలంలోని కిల్తంపాలెం జవహర్ నవోదయ విద్యాలయంలో వివేక్‌యాదవ్ తన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలసి ఆదివారం సందడి చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఏర్పాటుచేసిన మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ జిల్లాలో వంద గంటలలో నిర్మించిన పది వేల మరుగు దొడ్లు నిర్మాణాలను ప్రత్యేకంగా అభినందించటంపై కలెక్టర్ వివేక్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోని విజయనగరం జిల్లా పేరును ప్రత్యేకంగా ప్రశంసించటం చాలా స్ఫూర్తి దాయకమన్నారు. జవహర్ నవోదయ విద్యాలయం చైర్మన్ హోదాలో కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి మన్‌కి బాత్ వంద గంటలలో 25వేల మరుగుదొడ్లు నిర్మించటం అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారం ఎంతో ఉందని చెప్పారు. ప్రధాని ప్రశంసలను స్ఫూర్తిగా తీసుకొని ఆగస్టులో 50వేలు గాంధీ జయంతి నాటికి మరో 50 మరుగుదొడ్లు లక్ష్యంగా తీసుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దామ అంజయ్య, వైస్ ప్రిన్సిపాల్ సత్యవతి పాల్గొన్నారు.