నల్గొండ

ఈద్ ముబారక్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 26: ముస్లిం సోదరులు రంజాన్ పండుగ వేడుకలను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సోమవారం సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో సంతోషంగా జరుపుకున్నారు. రంజాన్ పురస్కరించుకుని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పరస్పరం ఈద్ ముబారక్ అంటు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్‌లతో పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హిందూసోదరులు ఆత్మీయ అలింగనాలతో ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి వారి ఇళ్లలో పండుగ వంటల రుచి చూడగా రంజాన్ వేడుకల్లో మతసామరస్యం ఫరిడవిల్లింది. సూర్యాపేటలో రంజాన్ వేడుకల్లో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హాజరై ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి సేమియ పంపిణీ చేశారు. స్వరాష్ట్రం తెలంగాణలో మూడో రంజాన్ జరుపుకుంటున్న ముస్లిం సోదరుల సంక్షేమానికి ప్రభుత్వం అందించే పథకాల అండతో వారు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగ తెలంగాణలో గంగాజమున సంస్కృతికి, మతసామరస్యానికి ప్రతీక అన్నారు. మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డితో పలు పార్టీల ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తిలలో రంజాన్ వేడుకలు ఘనంగా సాగాయి.
నల్లగొండ జిల్లాలో నకిరేకల్, మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ తదితర పట్టణాలు, మండలాల్లో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను సంబరంగా జరుపుకున్నారు. నకిరేకల్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావులు రంజాన్ ప్రార్ధనల్లో పాల్గొని ముస్లింలకు పండుగు శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ పట్టణంలోని ఈద్గా వద్ధ వేలాది మంది ముస్లింలు రంజాన్ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ప్రార్ధనల అనంతరం వారికి మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవిందర్, సిఎల్పీ ఉపనేత, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డిలు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సిపిఎం నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, టిడిపి నాయకులు కంచర్ల భూపాల్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి, చాడ కిషన్‌రెడ్డిలు ముస్లిం సోదరులకు ఈద్‌ముబారక్ తెలిపారు. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, జడ్పీ చైర్మన్ బాలునాయక్‌లు రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. హిందూ ముస్లింలంతా పండుగ ప్రత్యేక వంటల విందుతో ఆత్మీయతల మధ్య మతసామరస్యాలను చాటారు. భువనగిరి ఈద్గా వద్ధ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, పిసిసి నేత కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. వలిగొండ, పోచంపల్లి, బీబీనగర్, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోటకొండూరు, మోత్కూర్, చౌటుప్పల్, నారాయణపూర్ తదితర మండలాల్లో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.