విశాఖపట్నం

మత్స్యావతారంలో జగన్నాథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 26: జగన్నాథస్వామి రథోత్సవంలో భాగంగా టర్నర్ చౌల్ట్రీలో కొలువుతీరిన స్వామి తొలిరోజు సోమవారం తదియరోజున మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా స్వామివారికి లలిత సహస్రపారాయణం, విష్ణుసహస్రపారాయణం నిర్వహించారు. శ్రీ అక్కినిపిల్లి రాధా ప్రసాద్‌చే ధార్మిక ఉపన్యాసాలు, మార్గాన నాగేశ్వరరావు బృందంతో అన్నమాచార్య కీర్తనలు, రమాసుందరి శిష్యుబృందంతో భరతనాట్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దేవాదాయ,్ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ మూర్తి, ఉత్సవ ప్రత్యేక అధికారి ప్రసాద్, ఆలయ ఇవో బండారు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రిపాలెం జగన్నాథస్వామివారి అయ్యప్పనగర్ విజయ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలను అల్లు జగన్నాధరావు ప్రత్యేకంగా సమర్పించి పూజలు నిర్వహించారు.