కృష్ణ

తోట్లవల్లూరు దళితవాడ వద్ద పోలీస్ పికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, జూన్ 26: టిడిపి నేతలు నిర్వహించిన ర్యాలీలో వైసిపి-టిడిపి కార్యకర్తల మధ్య వివాదం చెలరేగడంతో ఆదివారం రాత్రి నుంచి తోట్లవల్లూరు దళితవాడ వద్ద పోలీస్ పికెట్ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి తోట్లవల్లూరులో మండల టిడిపి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. దళితవాడ వద్ద ఎన్‌టిఆర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశాక ఎమ్మెల్యే కల్పన ప్రసంగిస్తుతుండగా వైసిపి కార్యకర్తలు జై జగన్ అంటు నినాదాలు చేయటంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరువర్గాల మధ్య గొడవ జరగటంతో కొంత మంది నేతలు సర్దుబాటు చేసి సెంటర్లో సభా వేదికకు తరలి వెళ్ళారు. ఈ ఘటనతో వైసిపి కార్యకర్తలు భారీగా చేరుకుని దళితవాడ వద్ద ధర్నాకు దిగారు. ఎస్‌ఐ ప్రసాద్, పోలీసులు చేరుకుని ధర్నాను విరమింపచేశారు. ధర్నా అనంతరం వైసిపి కార్యకర్తలు సెంటర్‌కు చేరుకుని నినాదాలు చేశారు. ఈ ఘటన జరిగిన కొంత సేపటికి సెంటర్‌ల్లో ఏర్పాటు చేసిన టిడిపి నేతల బ్యానర్‌లను ఎవరో తొలగించారు. దాంతో టిడిపి నాయకులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బ్యానర్‌ల విషయమై ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితుల్లో టిడిపి-వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగకుండా చూసేందుకు పోలీసులు ముందు జాగ్రత్తగా పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు.