మెదక్

రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన మీరాకుమార్‌ను ఆదరిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, జూన్ 26: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ అయితే అందుకు సంపూర్ణంగా తన సహకారాన్ని అందించిన వారు అప్పటి లోక్‌సభ స్పీకర్, యుపిఎ రాష్టప్రతి అభ్యర్థి మీరాకుమార్ అని ఎమ్మెల్యే డాక్టర్ జె.గీతారెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఆమె సోమవారం జహీరాబాద్‌వచ్చారు. తన ఇంటివద్ద విలేఖరులతో మాట్లాడుతూ ఎండిఎ.రాష్టప్రతి అభ్యర్తి రాన్‌నాథ్ కోవింద్ ఆర్‌ఎస్‌ఎస్‌వాదన్నారు. రాష్ట్రంలో ఎంఐఎం మద్దతు తీసుకున్న సిఎణ కెసిఆర్ కేంద్రంలో కట్టర్ హిందుత్వవాధి, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన అభ్యర్థికి మద్దతివ్వడాన్ని ఆమె తీవ్రంగా పరిగణించారు. రాష్ట్రంలోని మైనార్టీలను కెసిఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో మతపరమైన రిజర్వేషన్లను కోవింద్ తీవ్రంగా వెతిరేకించారన్నారు. ఇలాంటి వారు రాష్టప్రతి పదవికి సరిపోరన్నారు. మీరా కుమార్ జాతీయ నాయకుడు బాబుజగ్గీవన్‌రామ్ కుతురిగా, లౌకికవాదిగా రాష్టప్రతి అభ్యర్థికుండాల్సిన అన్ని లక్ష్యణాలున్నాయన్నారు. అంతరాత్మ ప్రభోదంగా ఓటేసి గెలిపించాల్సిన భాద్యత ప్రతి లౌకికవాదిపై ఉందన్నారు.