ఖమ్మం

నల్లబ్యాడ్జిలతో ముస్లింల నిరసన ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, జూన్ 26: ముస్లింల పై మతోన్మాద దాడులను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనందుకు సోమవారం పట్టణంలోని ఎస్‌ఐఒ, ముస్లిం ఐక్యవేదిక సంఘం ఆధ్వర్యంలో ముస్లింలు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ పట్టణంలో భారీ ర్యాలా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఒ పాల్వంచ అధ్యక్షులు అబ్దుల్లాహ్, జమాతే ఇస్లామిహింద్ పట్టణ అధ్యక్షులు ముర్తుజా అలీఖాన్‌లు మాట్లాడుతూ ఇటీవల కలంలో గోరక్షణ్ పేరుతో కొందరు అతివాదులు చట్టాలను తమ చేతిలో తీసుకొని అమాయక భారతీయ ముస్లింలపై ఉగ్రదాడులకు పాల్పడుతున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించటం సరికాదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ వౌలిక సూత్రాన్ని నాశనం చేయాలని చూస్తున్న వర్గాల పై ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మాన్, సిరాజుద్దీన్, ముజాహిద్, అక్రం, ఇస్మాయిల్, జమీర్, అయ్యూబ్, నూమాన్, హసన్, హకీబ్ తదితరులు పాల్గొన్నారు.