భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! - 69

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయ్యప్పస్వామిని కన్నుల కరువు తీరా దర్శించి పడమర దిక్కునుంచి క్రిందికి దిగి వస్తారు భక్తులు! అయ్యప్పస్వామిని దర్శించి ప్రశాంతత నిండిన హృదయాలతో భక్తులు మాలికాపురత్తమ్మ గుడిని చేరుకుంటారు (ఇప్పుడు రెండు గుడుల మధ్య వంతెన కట్టబడి వున్నది)
మాలికాపురత్తమ్మ ఆలయం:మణికంఠుని చేత దైవత్వాన్ని పొందిన మహిషి దేవీ శక్తిగా లోకపావని అని పిలువబడుతూ ఇక్కడ కొలువై వున్నది! మాలికాపురత్తమ్మగా భక్తులను కాపాడుతూ, వారి కోర్కెలను తీర్చవలసిందిగా అయ్యప్ప చెప్పిన ప్రకారం తనను దర్శించేవారికి శుభాలు ప్రసాదిస్తుంది మాలికాపురత్తమ్మ! ఈమెను దర్శించుకుని రవిక గుడ్డలు, పసుపు, కుంకుమలు సమర్పిస్తారు! అమ్మవారికి సమర్పించిన రవిక గుడ్డలు ఋతుక్రమం ఆగిన స్ర్తిలు తీసుకువచ్చుకుని రవికెలు కుట్టించుకుంటారు! ఇక్కడ టెంకాయలు కొట్టరు! కుచ్చు తీసి దొర్లించి అక్కడే వదిలేస్తారు! పేలాలు, అటుకులు జల్లుతూ ప్రదక్షిణలు చేస్తారు! కనె్నస్వాములు వదిలి వెళ్లిన టెంకాయలను గుర్తించి ఆమె పంపిన ఏనుగు వచ్చి చెప్పడంతో కనె్నస్వాములు వచ్చినట్లు గ్రహించి ప్రతి సంవత్సరం నిరుత్సాహం చెందుతుంటుంది మాలికాపురత్తమ్మ! (కనె్నసాములు రాని సంవత్సరం ఆమెను వివాహం చేసుకుంటానని మణికంఠస్వామి చెప్పినందువల్ల ఆ విధంగా జరగటానికి అవకాశం లేకుండా ప్రతి సంవత్సరం కనె్నస్వాముల సంఖ్య ఎక్కువవుతూనే వుంటున్నది)
మాలికాపురత్తమ్మ ఆలయం దర్శించిన తర్వాత గణపతి ఆలయం, నాగరాజు- నాగయక్షిణిల ఆలయాలను దర్శించుతారు! ఇక్కడ పూజలు చేసి, నాగులమీద పాటలు పాడతారు! అట్లా చేయడంవల్ల సర్వ దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు మధ్యలో వచ్చే అయ్యప్ప మిత్రుల గుడులను కూడా దర్శిస్తారు!
భస్మకొలను:ఈ కోనేరు స్వామి గుడి వెనుక
వున్నది! శబరి చితాభస్మాన్ని ఈ కొలనులోనే కలపటంవలన ఈ కొలనుకు ఆ పేరు వచ్చిందని ప్రతీతి! భస్మకొలనులో భక్తులు స్నానం ఆచరించి బసకు తిరిగి వెళతారు
ఇరుముడి విప్పటం:మండల దీక్ష, యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని, ఇతర దేవీ దేవతల మందిరాలను దర్శించుకుని ఎంతో తృప్తినిండిన హృదయాలతో ఇరుముడలను గురుస్వాములకు అప్పగిస్తారు దీక్షాధారులు!
గురుస్వామి ఇరుముడులను విప్పి పూజా సామగ్రిని వేరుచేస్తారు! ముందుగా ముద్రను పగులగొట్టి అందులోని నేతిని వేరుగా ఒక పాత్రలోకి తీస్తారు! ఈ నేతి పాత్రతో, గంధం, పంచామృతాలు, విభూది వేరు వేరు పాత్రలలో తీసుకుని దీక్షాధారులు తిరిగి అయ్యప్ప గుడికి వెళ్లి స్వామికి నెయ్యాభిషేకం చేయించి, ఆ నేతిని ప్రసాదంగా స్వీకరించి తమ వెంట తీసుకువెళతారు! స్వామికి అభిషేకం చేసిన
ఈ నెయ్యి పరమ పవిత్రమైనది! సర్వరోగ నివారిణి! దీర్ఘరోగాలతో బధపడేవారు ఈ నెయ్యిని కొద్దిగా సేవించటంవల్ల సత్వరంగా ఉపశమనం లభిస్తుంది! ప్రసాదపు నెయ్యిని జాగ్రత్తగా ఇళ్ళకు తీసుకువెళ్లి బంధు, మిత్రులకు పంచడం పరమ పుణ్యప్రదం! అభిషేకానంతరం పూజా ద్రవ్యాలను, గంధం, కొబ్బరికాయలను సమర్పించుతారు! కొన్ని కొబ్బరి చిప్పలు గుడిలో జరిగే గణపతి హోమంలో వేసి కొన్నిటిని ప్రసాదంగా తీసుకుంటారు. తరువాత విభూదిని పళ్లెంలో వేసుకుని, కర్పూర హారతి చూపి, భస్మం ఇతరభక్తులమీద జల్లుతూ అమ్మవారి గుడిని చేరి ఇరుముడిలో నుండి వేరు చేసిన రవిక గుడ్డలు, పూజాద్రవ్యాలు సమర్పించి తిరిగి వస్తారు! ఇరుముడిలో కట్టి తెచ్చిన మిరియాలను వావరు స్వామి గుడిలో సమర్పిస్తారు!
ఇరుముడి తలమీద పెట్టుకుని స్వామిని దర్శించటం, తిరిగి దానిని విప్పి తెచ్చిన నెయ్యి, ఇతర పూజా ద్రవ్యాలు స్వామికి సమర్పించి ప్రసాదాలు తెచ్చి తిరుగుప్రయాణం కోసం భద్రపరచుకోవడం పూర్తయిన తర్వాత సాయంత్రం మకర జ్యోతి దర్శనం కోసం ఆత్రంగా ఎదురుచూడటం మొదలౌతుంది! స్వామివారి ఆభరణాలు కూడా ఆ రోజు సాయంత్రానికే సన్నిధానం చేరుకుంటాయి!
స్వామివారి ఆభరణాలు:స్వామి రాకుమారుడుగా ధరించిన ఆభరణాలను పంబలరాజు, స్వామి తండ్రి అయిన రాజశేఖరుని
విన్నపాన్ని అంగీకరించి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతినాడు వాటిని స్వామి విగ్రహానికి అలంకరించడం జరుగుతున్నది! ఆ ఆభరణాలు వుంచిన మూడు పెట్టెలు పంబల రాజవంశీయుల అధీనంలో వుంటాయి! మకర సంక్రాంతినాడు పెట్టెలను ఉత్సవంగా మేళతాళాలతో తలమీద వుంచుకుని బయలుదేరుతారు రాజవంశంవారు! ఆ సమయంలోనే ఆకాశమార్గాన పెద్ద గరుడ పక్షి ఎగురుతూ పెట్టెలకు రక్షణగా వస్తుంటుంది! శబరిమలమీద వున్న భక్తులకు ఆ పక్షి కనబడుతుంటుంది. దాన్ని చూసి ఆభరణాల పెట్టెలు బయలుదేరాయని గ్రహిస్తారు భక్తజనం!
-ఇంకాఉంది

డాక్టర్ టి. కళ్యాణీసచ్చిదానందం