బిజినెస్

పోస్ట్‌పెయిడ్ యూజర్లకు బిఎస్‌ఎన్‌ఎల్ భారీ డేటా ఆఫర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. తమ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు మరింత డేటా లభించే ఆఫర్లను ప్రకటించింది. శనివారం నుంచే అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్ల విషయానికొస్తే.. ప్రస్తుత పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై ఆరు రెట్లు అధికంగా డేటా లభించనుంది. ‘ప్లాన్ 99 వినియోగదారులకు 250 ఎమ్‌బి డేటా వస్తుందని బిఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది. ఇంతకుముందు ఈ ప్లాన్‌తో ఎలాంటి డేటా లేదు. ఇక ‘ప్లాన్ 225’ వినియోగదారులకు 1జిబి డేటా లభిస్తుందని ప్రకటించింది. ఇంతకుముందు ఈ ప్లాన్‌తో కేవలం 200 ఎమ్‌బి డేటానే లభించేది. అలాగే ‘ప్లాన్ 799’ వినియోగదారులకు 10 జిబి డేటాను ఆఫర్ చేస్తోంది. గతంలో 3జిబి డేటా మాత్రమే వచ్చేది. ఈ ప్లాన్లపై అపరిమిత వాయిస్ కాల్స్ సౌకర్యాన్నీ వినియోగదారులు పొందవచ్చని బిఎస్‌ఎన్‌ఎల్ ఓ ప్రకటనలో తెలియజేసింది. మొత్తానికి ప్రీపెయిడ్ యూజర్లకేగాక ఇప్పుడు పోస్ట్‌పెయిడ్ వారికీ బిఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్లను ఇస్తోంది.