ముచ్చటగా మూడోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కసారి ఓ జంట ప్రేక్షకులకు నచ్చేసి ఆ సినిమా హిట్ అయిందంటే చాలు, ఆ జంటతోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని ప్రేక్షకులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లేనని అర్థం. అందుకే దర్శక నిర్మాతలు కూడా అదే కాంబినేషన్‌లో రూపొందించే ప్రయత్నం చేస్తారు. తాజాగా నాని, నివేదా థామస్ జంటకు ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో జంటిల్‌మేన్, నిన్నుకోరి చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు విజయవంతం కావడంతో ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనున్నట్లు టాలీవుడ్ సమాచారం. నాని ప్రస్తుతం ఎంసిఏ, కృష్ణార్జుయుద్ధం చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూ పొందే కృష్ణార్జున యుద్ధంలో నివేదా థామస్ కథానాయికగా నటించనున్నదట. సినిమా యూనిట్ మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. నివేదా కూడా మంచి అవకాశాలనే పట్టేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన జై లవకుశలో నటిస్తుండడం విశేషం.