జాతీయ వార్తలు

నేడే కౌంటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: భారత రాష్టప్రతి ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ గురువారం మొదలవుతుంది. సాయంత్రం ఐదుగంటలకల్లా కొత్త రాష్టప్రతి ఎవరన్నది తేలిపోతుంది. ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, ముందుగా పార్లమెంటులో ఓటింగ్ జరిగిన బ్యాలెట్ బాక్స్‌ను తెరుస్తామని, అనంతరం అక్షరక్రమాన్ని బట్టి రాష్ట్రాలనుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తామని లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా తెలిపారు. నాలుగు ప్రత్యేక టేబుల్స్‌పై ఈ కౌటింగ్ జరుగుతుందని, మొత్తం ఎనిమిది రౌండ్ల పాటు ఈ ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. సోమవారం జరిగిన ఈ ఎన్నికలో 99శాతంమంది చట్టసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార ఎన్‌డిఏ అభ్యర్థిగా రంగంలోకి దిగిన కోవింద్ ఘన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.