రంగారెడ్డి

క్రీడల్లో గెలుపు, ఓటమి సహజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, జూలై 20: క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా తీసుకుని ముందుకు సాగేందుకు క్రీడాకారులు కృషి చేయాలని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం ఫరూఖ్‌నగర్ మండలం దూసకల్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో నిర్వహించే టోర్నమెంటుల్లో ప్రతిభను చాటేందుకు క్రీడాకారులు కృషి చేయాలని అన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు ఇలాంటి టోర్నమెంట్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయని వివరించారు. స్నేహ సంబంధాలు పెరుగుతాయని, ప్రతి క్రీడాకారుడు కీడల్లో పాల్గొని తమ సత్తా టాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జగదీశ్వర్, కాంగ్రెస్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్, లింగారం యాదయ్యతోపాటు క్రీడాకారులు పాల్గొన్నారు.