తూర్పుగోదావరి
ఉద్ధృతంగా గోదావరి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాజమహేంద్రవరం, జూలై 20: అఖండ గోదావరి నది వరద నీటి ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. రాజమహేంద్రవరం ఎగువ ప్రాంతంలో వడి పెరిగింది. సుడులు తిరుగుతూ పరవళ్లు తొక్కుతోంది. తూర్పు కనుమల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతోనూ, ప్రధానంగా గోదావరి ఉప నది శబరికి వరద పోటెత్తడంతో గురువారం నుంచి గోదావరి నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 174 గేట్లను ఒక మీటర్ మేర ఎత్తివేసి వరద జలాల ఉద్ధృతిని క్రమబద్ధీకరిస్తున్నారు. మొత్తం 3 లక్షల 53 వేల 226 క్యూసెక్కుల వరద జలాలను కాటన్ బ్యారేజి నుంచి సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజి వద్ద గురువారం సాయంత్రం 7.60 అడుగుల మట్టం నమోదైంది. భద్రాచలం వద్ద వరద జలాల ఉద్ధృతి పెరుగుతుండటంతో దిగువన మరింత మట్టం పెరిగే అవకాశముంది. భద్రాచలం వద్ద 43 అడుగులకు నీటి మట్టం చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక నమోదవుతుంది. ప్రస్తుతం 36.61 అడుగుల మట్టంలో ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక దగ్గర వరకు వచ్చి ఆపై తగ్గవచ్చని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలావుండగా ఏటిగట్ల వద్ద లస్కర్లను పహారాకు పెట్టారు. ఫ్లడ్ మెటీరియల్లో ఎక్కడైనా ఎటువంటి సమస్య ఎదురైనా అప్రమత్తమైనట్టు జల వనరుల శాఖ అధికారులు తెలియజేశారు. మరో 48 గంటలపాటు వరద ఉద్ధృతి మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏటిగట్ల పరివాహక ప్రజలను అప్రమత్తం చేశారు. ఎర్ర గోదావరి సుడులు తిరుగుతూ క్రమేణా ఉద్ధృతి పెంచింది.
అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతంలో కాళేశ్వరం వద్ద 7.45 మీటర్ల మట్టంలో ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. పేరూరు వద్ద 7.96 మీటర్లు, దుమ్ముగూడెం వద్ద 10.48, కొయిదా వద్ద 12.60, కూనవరం వద్ద 9.68, కుంట వద్ద 10, పోలవరం వద్ద 16.90 మీటర్లు, రాజమహేంద్రవరం పుష్కరఘాట్ రైల్వే వంతెన వద్ద 13.94 అడుగుల ప్రవాహ మట్టం నమోదైంది. కాటన్ బ్యారేజీ నుంచి సాగునీటి నిమిత్తం ఈస్ట్రన్ డెల్టాకు 2600 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 1800, వెస్ట్రన్ డెల్టాకు 1000 క్యూసెక్కులు చొప్పున విడుదల చేశారు.
పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి
చింతూరు, జూలై 20: గత రెండురోజుల నుంచి ఉప్పొంగి ప్రవహిస్తున్న శబరి గురువారం కాస్త శాంతించింది. బుధవారం 32 అడుగులకు చేరుకుని ప్రవహించిన శబరి గురువారం సాయంత్రానికి 27 అడుగులకు చేరుకుంది. కానీ గోదావరి ఉద్ధృతి మాత్రం క్రమక్రమంగా పెరుగుతోంది. శబరి శాంతించడంతో శబరికి అనుసంధానమైన వాగులు సైతం శాంతించాయి. నిన్నటి వరకు రోడ్డెక్కి ప్రవహించిన కుయిగూరు, చీకటివాగులు రహదారులను వీడాయి. సోకిలేరు, జల్లివారిగూడెం వాగులు ఇంకా రహదారులపైనే ప్రవహిస్తున్నాయి. సోకిలేరు వాగు ఉద్ధృతి తగ్గడంతో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. వాగులు రహదారులను వీడటం, ఉద్ధృతి తగ్గడంతో చింతూరు, విఆర్ పురానికి రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. కానీ గోదావరి ఉద్ధృతి క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఎటపాక, కూనవరం, విఆర్ పురం మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం గుప్పెట్లో జీవనం సాగిస్తున్నారు. ఐటిడిఎ పిఒ చినబాబు గురువారం భద్రాచలంలోని గోదావరిని సందర్శించి వరద ఉద్ధృతిని పరిశీలించారు. గోదావరి ఉద్ధృతి పెరుగుతుండటంతో విలీన మండలాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని చినబాబు ఆదేశించారు.
విఆర్పురం వద్ద...
విఆర్ పురం: గోదావరి తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతూ గురువారం పెరగటం ప్రారంభించింది. భద్రాచలం వద్ద బుధవారం 23.8 అడుగులకు పెరిగిన గోదావరి, సాయంత్రానికి 21.8 అడుగులకు తగ్గింది. అయతే అర్ధరాత్రి నుంచి పెరగటం ప్రారంభించింది. సాయంత్రానికి 36.7 అడుగులకు చేరుకుంది. అదేవిధంగా విఆర్ పురం వద్ద బుధవారం 9.64 మీటర్లుగా ఉన్న గోదావరి, గురువారం సాయంత్రానికి 12.69 మీటర్లకు చేరుకుంది. పెరుగుతున్న గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని, వరదలను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గోదావరి ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరుకోవటంతో స్వల్పంగా పెరుగుతోంది. పెరుగుతున్న గోదావరి ఇంకో అడుగు వరకూ పెరిగి తగ్గుముఖం పడుతుందని సమాచారం తెలిసిందని, ప్రజలు కంగారు పడనవసరంలేదని చింతూరు ఐటిడిఎ పిఒ చినబాబు పేర్కొన్నారు.
కూనవరం వద్ద...
కూనవరం: కూనవరం వద్ద గోదావరి గురువారం స్వల్పంగా పెరుగుతూ రాత్రి ఏడు గంటలకు 12.82 మీటర్లకు చేరుకొని ప్రవహిస్తోంది. శబరినదికి వరద పోటు తగ్గటంతో గోదావరి శుక్రవారం ఉదయం వరకూ మరో మీటరు పెరిగి తరువాత తగ్గుముఖం పడుతుందని, సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు. ప్రవహిస్తున్న గోదావరిలో కలప రావటంతో స్థానికులు, నదిలోకి వెళ్లి కలపను ఒడ్డుకు చేర్చేందుకు ఉత్సాహం చూపించారు. చింతూరు ఐటిడిఎ పిఒ చినబాబు, ఆర్డీవో యల్లారమ్మ స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు.