అనంతపురం
నేటి నుంచి ఉపాధ్యాయ కౌనె్సలింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అనంతపురం సిటీ, జూలై 21:జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. నేడు ఉదయం 10 గంటలకు గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులకు, పిడి, పిఇఓలకు మ్యాన్యువల్గా సైన్సు కేంద్రంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు డిఇఓ పి.లక్ష్మినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. కౌనె్సలింగ్ హాజరయ్యే ఉపాధ్యాయులు తమ ఆన్లైన్ దరఖాస్తు కాఫీని, ఫ్రిఫరెన్షియల్ సర్ట్ఫికెట్లు ఉంటే వాటిని, రిజిస్టర్ను తీసుకోని రావాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులోల 10,242 మంది ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఒకే పాఠశాలలో 8 సంవత్సరాలు పూర్తియిన వారు 6,339 మంది ఉన్నారని తెలిపారు. వీరందరు తప్పకుండా మరొక పాఠశాలకు బదిలీ కావాల్సిందేనని ప్రభుత్వ నిబంధనలు ఇచ్చారని తెలిపారు. జిల్లాలో 3,903 మంది ఉపాధ్యాయులు తమకు బదిలీ కావాలని దరఖాస్తు చేసుకున్నారన్నారు. రెండు సంవత్సరాల్లోపు పదవీ విరమణ పొందే ఉపాధ్యాయులకు ఒకే పాఠశాలల్లో 8 సంవత్సరాలు పూర్తియినా వారికి బదిలీల్లో మినహాయింపు ఇచ్చి, అదే పాఠశాలలోనే కొనసాగించనున్నారని తెలిపారు. 22న హెచ్ఎంలకు, పిడిలకు, పిఇటిలకు మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో 200 మంది హెచ్ఎంలు, 232 పిడి,పిఇటిలు మ్యాన్యువల్ కౌన్సిలింగ్కు హాజరుకావాల్సి ఉందన్నారు. 23వ తేదీ నుండి 24వ తేదీ వరకు ల్యాంగ్వేజెస్ స్కూల్ అసిస్టెంట్లుకు, ఎల్పిలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 25,26వ తేదీల్లో ఎస్ఏ నాన్ ల్యాంగ్వేజెస్లకు, 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఎస్జీటిలకు మ్యాన్యువల్ బదిలీ కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని, ప్రభుత్వ విద్యాశాఖ కమీషనర్ నుండి ఏ ఆదేశాల వచ్చిన వాటిని అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.