శ్రీకాకుళం

నాగావళి తల్లికి మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూలై 21: ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి శుక్రవారం నాగావళి నదీ తీరానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇటీవల ఒడిషాలో కురిసిన భారీ వర్షాల కారణంగా నాగావళి నది పొంగి పొరలి వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి విజయవాడలో రాష్టప్రతి ఎన్నికల్లో పాల్గొన్నారు. వరదలు తగ్గుముఖం పట్టాలని అక్కడ నుండి నాగావలి తల్లికి కోరుకున్నారు. వరదలు తగ్గుముఖం పట్టిన వెంటనే శ్రీకాకుళం చేరుకున్న ఎమ్మెల్యే శుక్రవారం శాస్ర్తియంగా నాగావళి నది తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. టిడిపి నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్; ఎస్ వి రమణమాదిగ, కరగాన భాస్కర్, రాము, గుమ్మా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.