నిజామాబాద్
శ్రీరాంసాగర్లోకి 800 క్యూసెక్కుల వరద నీరు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాల్కొండ, జూలై 23: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టులలో ఒకటైన శ్రీరాంసాగర్ రిజర్వాయర్లోకి 800క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా గోదావరిలోకి ఈ వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ఆదివారం సాయంత్రం నాటికి రిజర్వాయర్లో నీటి మట్టం 1055.30అడుగులు, 9.50టిఎంసిలకు చేరుకుంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 90టిఎంసిలు కాగా, గత సంవత్సరం ఇదే సమయానికి రిజర్వాయర్లో నీటి మట్టం 1063.90అడుగులు, 18.57టిఎంసిల వద్ద నీరు నిలువ ఉందని అధికారులు వివరించారు. కాకతీయ కాలువ ద్వారా 470క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూన్ మొదటి వారం నుండి ఇప్పటివరకు రిజర్వాయర్లోకి 0.769టిఎంసిల వరద నీరు వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. కాగా, రిజర్వాయర్ పైకి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తూ ఎస్సారెస్పీ అందాలను తిలకిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన బోటులో షికారు చేశారు. ఇదిలాఉండగా, ప్రాజెక్టు దిగువన నిర్మించిన పార్కును సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల నుండి కొందరు దళారులు వాహనాల పార్కింగ్ పేరిట డబ్బులు వసూలు చేస్తుండడం వారిని ఆవేదనకు గురి చేస్తోంది.