భక్తి కథలు

బసవ పురాణం- 17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవివేకుడనైన నాలో వివేకం ఎందుకుంటుంది?
ఈ విధంగా బసవన్న తన్ను తాను చిన్న జేసుకొని మారయ్యను పొగిడాడు.
మారయ్యా బసవయ్యా ఈ విధంగా భక్తి వారాశిలో మునిగితేలారు
కన్నడ బహ్మయ్య కథ
కల్యాణంలోనే కన్నద బ్రహ్మయ్య అనే గజదొంగ ఒకడున్నాడు. అతడు మహాశివభక్తుడు. రాత్రిళ్లు ఇళ్లకు కన్నాలు వేసి లోపలికి వెళ్లేవాడు. ఆ ఇల్లు శివ భక్తులదయితే వారి పాదాలకు శరణం జేసి ‘‘నేను కన్నద బ్రహ్మయ్యను. తెలియక మీ ఇంటికి దొంగతనానికి వచ్చాను. క్షమించండి’’ అని ప్రార్థించి ‘‘దొంగలొస్తారేమో జాగ్రత్తగా ఉండండి’’ అని మరీ హెచ్చరించి వెళ్ళేవాడు. తాను వెళ్లిన ఇల్లు పిసినిగొట్టు మనుషులది కనుక అయినట్లయితే ఆ ధనాన్నంతా సంగ్రసించి మరునాడు దానితో జంగమార్చనలు చేసి సంతృప్తి చెందేవాడు.
ఇలా ఉండగా ఒకనాడు కన్నద బ్రహ్మయ్య ఇంటికి అసంఖ్యాకులైన జంగమయ్యలు వచ్చారు. వారందరినీ అర్చించాలంటే మామూలు ధనం సరిపోదు. వారూ వీరూ ఎందుకు? బిజ్జలుని ధనాగారమే కొల్లగొడుతాను అనుకున్నాడు
బ్రహ్మయ్య.
బ్రహ్మయ్య కత్తి, గునపము చేత బట్టి వెళ్తుంటే వీధిలో బసవేశ్వరుడు ఎదురుపడ్డాడు. ‘బసవన్నా, నేను బిజ్జలుని ధనాగారం కొల్లగొట్టాలని వెళ్తున్నాను. దయతో దారిచూపు’ అని అర్థించాడు బ్రహ్మయ్య. భక్తులడిగితే లేదనేది లేని వ్రతంకల బసవన్న ‘సరే! పద’మని బ్రహ్మయ్యను వెంటబెట్టుకొని వెళ్లి బిజ్జలుని ధనాగారం చూపాడు. బ్రహ్మయ్య ధనాగారాన్ని కొల్లగొట్టి తీసుకొని వెళ్లిపోయాడు.
రక్షకులకీ విషయం తెలిసి రాజుకు చెప్పారు. బిజ్జలుడది విని మండిపడ్డాడు. ‘‘శివభక్తుడని విశ్వసించి బసవడికి ఈ పదవి ఇస్తే చివరకు నా ధనాగారానికే ఎసరు పెడతాడా?’’ అని క్రోధంతో ధనాగారం వద్దకు పరుగెత్తుకొనిపోయాడు.
బిజ్జలుడు వచ్చి ధనాగారానికి కన్నద బ్రహ్మయ్య తవ్విన కన్నం చూచేసరికి ఆ కన్నం తీసిన మట్టికుప్ప మొత్తం బంగారమై కన్పడింది. అది చూచి బిజ్జలుడు దిగ్భ్రాంతుడైనాడు. అప్పుడు బసవన్న బిజ్జలునితో ఇలా అన్నాడు. ‘‘రాజా! కన్నద బ్రహ్మయ్య సామాన్యుడు కాడు. అణిమాద్యష్టసిద్దులు కలిగిన మహాయోగి. అయితే దొంగతనం వృత్తిగా స్వీకరించాడు. ఆ విధమైన కాయకాన సంపాదించిన దానినే గ్రహిస్తాడు కనుక నీ భాండాగారానికి కన్నం పెట్టాడు.
అయితే దొంగతనం తప్పు కాదా అని నీవు నన్నడగవచ్చు ప్రభూ! కాని తప్పు దొంగతనంలో లేదు. దాని ప్రయోజనంలో వుంది. జూదమాడి పాండవులు భ్రష్టులైనారు. కాని జూదమాడి ఒక భక్తడు శివుణ్ణి చేరాడు. వేటాడి రాముడు భార్యను పొగొట్టుకున్నాడు. వేటాడి తిన్నడు శివసాయుజ్యం పొందాడు. పరసతి నాసించి రాజులు నశిస్తే పరసతివల్ల మోక్షం పొందాడు నంది. మాండవ్యుడు హత్య చేసి కొరత వేయబడ్డాడు. కాని చండుడు హత్య చేసి శివానుగ్రహం పొందాడు. అబద్ధం చెప్పి బ్రహ్మ తల పొగొట్టుకున్నాడు. కాని అబద్ధం చెప్పి చిరుతొండడు కైలాసం పోయాడు. గొర్రెను దొంగిలించి శూద్రకుడు నరకం పొందితే అదే పనివల్ల శివభక్తుడు సాయుజ్యం పొందాడు. ‘రాజ్యాంతే నరక’మని అంటారు కాని చౌరవ, చోడుడు శివభక్తులై పాలించి కైలాసం చేరారు. కాబట్టి ఏది తప్పు ఏది ఒప్పు అని నిర్ణయించవలసింది దాని ప్రయోజనాన్ని బట్టి మాత్రమే! అధర్మో ధర్మతాం వ్రజేత్ అనే శివవాక్యం నీవు వినలేదా?
ఇక కన్నద బ్రహ్మయ్య సంగతి చెపుతాను. శివపూజ కొరకు మాత్రమే అతడు దొంగతనం చేస్తాడు. అప్పుడు పగలూ రాత్రీ అని చూడడు. అందునా భక్తుల ఇళ్ళ జోలికి పోడు. లుబ్ధులైనవారి ధనాన్ని తీసుకొనిపోయి భక్తులకిస్తాడు. ఈ విధంగా ఆ పిసినిగొట్టువారిని కన్నద బ్రహ్మయ్య అనుగ్రహిస్తున్నాడని అర్థం!
ఇప్పుడు నీ ధనాగారాన్ని బ్రహ్మయ్య ఈ విధంగా అనుగ్రహించాడు. బిజ్జలా! డబ్బు పోయిందని దుఃఖించకు. నీ ధనమంతా నీ భాండారంలోనే వుంది చూడు’’ అని లెక్కల పుస్తకం తీసి చూపించి దాని ప్రకారం లోపల సొమ్మంతా ఎక్కడిదక్కడ ఎట్లా యథాస్థానంలోనే వుందో చూపించాడు బసవన్న. బిజ్జలుడు నివ్వెరపోయాడు. బసవన్న చిరునవ్వు నవ్వాడు.
అక్కడ కన్నద బ్రహ్మయ్య తాను కాయకంతో తీసుకొనిపోయిన ధనంతో జంగమార్చన చేసి శివానుభవం పొందాడు.
6
కల్యాణ నగరంలో శివనాగుమయ్య అనే మహాభక్తుడు ఉండేవాడు. అతడు కులం చేత అంత్యజుడు. గుణం చేత అగ్రజుడు. ఆయనను బసవేశ్వరుడు నిత్యం అర్చించేవాడు. అది చూచి అగ్రకులానికి చెందినవారు రాజు వద్దకుపోయి ఇలా చెప్పారు.
‘‘ప్రభూ మన బసవయ్య మాల మాదిగలను భక్తులు భక్తులంటూ పొగుడుతున్నాడు.
- ఇంకా ఉంది

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్