విశాఖపట్నం

న్యాయవాదుల సేవలు వినియోగించుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ: తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్‌లో ఉన్న న్యాయవాదుల సేవలను పార్టీ కోసం వినియోగించుకుంటామని టిడిపి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ తెలియచేశారు. లీగల్‌సెల్ నాయకులతో పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. తను ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే ప్రజా దర్బార్‌కు ఇద్దరు, ముగ్గురు న్యాయవాదులు హాజరు కావాలని సూచించారు. చంద్రన్న బీమాకు సంబంధించిన సమస్యల పరిష్కారం, కార్మికులు ఎదుర్కొంటున్న లీగల్ సమస్యలను పరిష్కరించడానికి లీగల్ సెల్ నాయకులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షుడు ఎస్‌వి రమణ, ప్రధాన కార్యదర్శి సవిలి సతీష్ కుమార్, సీనియర్ నాయకులు పిఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.