తూర్పుగోదావరి

పిఎసిలో చిరకాల ప్రత్యర్థులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం: శాసనసభకు సంబంధించి కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుల నియామకంలో జిల్లాకు ఎనలేని ప్రాధాన్యం కల్పించినట్టయ్యంది. జిల్లాకు సంబంధించి మళ్లీ రామచంద్రపురం నియోజకవర్గానికి రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలైన టిడిపి, వైసిపి ఒక ప్రత్యేక ప్రాధాన్యత కల్పించినట్టయ్యంది. విపక్ష సభ్యుడు ఛైర్మన్‌గా వ్యవహరించే పిఎసిలో శాసనసభ, మండలిలో ఆయా పార్టీలకు ఉండే బలాబలాల ఆధారంగా సభ్యులను నియమిస్తారు. ఇందులో జిల్లా నుండి టిడిపి, వైసిపి ఒక్కొక్కరికి అవకాశం కల్పించాయ. అయతే ఈ ఇద్దరూ రామచంద్రపురం నియోజకవర్గానికి చెందినవారే కావడం విశేషం. అందులో ఒకరు రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు (టిడిపి), మరొకరు పిల్లి సుభాష్‌చంద్రబోసు (వైసిపి). వీరిరువురు రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. చిరకాల ప్రత్యర్థులైన వీరిరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనేది జగద్వితం. తాజాగా పిఎసిలో సభ్యత్వాలు దక్కడంతో ఇరు పార్టీలు వీరిరువురికి సమ ప్రాధాన్యం కల్పించినట్టయ్యంది. కాగా పిఎసి చరిత్రలో ఒక నియోజకవర్గం నుండి ఇద్దరు సభ్యులు పిఎసిలో కలిగియుండటం ఇదే ప్రథమమని సీనియర్ ఎమ్మెల్యేలు తెలిపారు.
దివంగత భూమా నాగిరెడ్డి పిఎసి ఛైర్మన్‌గా ఉన్న గత పిఎసిలో కూడా తోట త్రిమూర్తులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాకు సంబంధించి అక్రమాల గుట్టగా తయారైన వంతాడ గనుల అంశంలో ఛైర్మన్‌గా భూమా నాగిరెడ్డి, సభ్యునిగా తోట త్రిమూర్తులు తీవ్రంగా స్పందించారు. రాజకీయ పరిస్థితులు తారుమారై, భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీకి మారడంతో, కొంతకాలంగా పిఎసి వ్యవస్థ మరుగున పడింది. కొత్తగా ఏర్పాటైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహరిస్తారు.