జాతీయ వార్తలు
కాశ్మీర్లో ఎన్కౌంటర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 6 August 2017
శ్రీనగర్, ఆగస్టు 5: జమ్మూకాశ్మీర్లో మిలిటెంట్లకోసం భద్రతా దళాల గాలింపు సాగుతోంది. తాజాగా బారాముల్లా జిల్లాలో ముగ్గురు లష్కరె తొయిబా మిలిటెంట్లను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. సోపోర్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. సోపోర్ ప్రాంతంలోని అమర్గ్రాలో మిలిటెంట్లు ఉన్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది. భద్రతా దళాలు గాలిస్తుండగా మిలిటెంట్లు ఏకపక్షంగా కాల్పులకు దిగారు. వెంటనే భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు లష్కరె తొయిబా మిలిటెంట్లు హతమయ్యారు. సంఘటనా స్థలం నుంచి మూడు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
చిత్రం.. ఎన్కౌంటర్ను నిరసిస్తూ ముస్లిం మహిళల నినాదాలు