క్రీడాభూమి

బెంగాల్ వారియర్స్‌పై బెంగళూరు విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, ఆగస్టు 9: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌పై బెంగళూరు బుల్స్ ఆరు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు 31 పాయింట్లు చేయగా, బెంగాల్ 25 పాయింట్ల వద్ద ఆగిపోయింది. బెంగళూరు తరఫున అజయ్ కుమార్ 8 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రోహిత్ కుమార్ 6, ఆశిష్ కుమార్ 5 చొప్పున పాయింట్లు చేశారు. బెంగాల్ ఆటగాళ్లలో జాంగ్ కున్ లీ ఒంటరి పోరాటం కొనసాగించి 8 పాయింట్లు సంపాదించాడు. రణ్ సింగ్ నాలుగు పాయింట్లు చేశాడు. మిగతా వారు విఫలం కావడంతో బెంగాల్‌కు ఓటమి తప్పలేదు. గురువారం పుణేరీ పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. రెండో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్ జట్టు ఢీ కొంటుంది. ఈ రెండు మ్యాచ్‌లతో నాగపూర్ మజిలీకి తెరపడుతుంది. ఆతర్వాత ఆహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు 11 నుంచి మొదలవుతాయి.