ఆటాపోటీ

చైనా ఆధిపత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ బాడ్మింటన్‌లో చైనా ఆధిపత్యం కొనసాగున్నది. అత్యధిక స్వర్ణ పతకాలు సాధించిన దేశాల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మొత్తం 61 పతకాలు చైనా ఖాతాలో ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న ఇండోనేషియా 21 పతకాలు గెల్చుకున్నదంటే, చైనా ఏ స్థాయిలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నదో ఊహించుకోవచ్చు. డెన్మార్క్, దక్షిణ కొరియా చెరి పది పతకాలతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. రజతం, కాంస్యాలను కూడా కలిపితే చైనా మొత్తం 167 పతకాలు గెల్చుకుంది. వీటిలో 61 స్వర్ణంకాగా, 42 రజతం, 64 కాంస్యాలు. ఇండోనేషియా 21 స్వర్ణం, 17 రజతం, 33 కాంస్యాలతో 71 పతకాలు సాధించింది. డెన్మార్క్ వద్ద 10 స్వర్ణం, 13 రజతం, 37 కాంస్యం (మొత్తం 60) పతకాలున్నాయి. దక్షిణ కొరియా 10 స్వర్ణం, 13 రజతం, 29 కాంస్యాలతో మొత్తం 52 పతకాలను సాధించింది. భారత్ ఇప్పటి వరకూ ఒక రజతం, మూడు కాంస్యాలతో ఐదు పతకాలను అందుకొని, ఈ జాబితాలో 13వ స్థానంలో ఉంది.